సత్యసాయి: ధర్మవరం మండలం రావులచెరువు వీఆర్ఏ శివానందపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తన ఇంటి వద్ద ఉండగా గ్రామానికి చెందిన మేకల ఉపేంద్ర, లక్ష్మయ్య, నరసమ్మ, కుమార్ కలిసి కట్టెలు, రాళ్లతో దాడి చేశారని ఆయన వాపోయారు. శివానంద ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.