ATP: జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులుగా ఉంటూ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లో 2026-27 సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. తొలి విడతలో 607 కార్డులను మంజూరు చేసినట్లు వెల్లడించారు.