ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్ ఆవరణలో మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న తరుణంలో ఇద్దరు నేతలు ఈ చారిత్రాత్మక నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.