GNTR: కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి తిరునాళ్లు సోమవారం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం గ్రామంలో మేళతాళాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది. సోమవారం జరిగే తిరునాళ్ల మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని ఆలయ కమిటీ కోరింది.