NLR: లింగసముద్రం మండలంలోని గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య పెరుగుతోంది. రాత్రి వేళ వాహనదారులను వెంటాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పాదచారులపై గుంపులుగా దాడి చేస్తున్నాయి. తిమ్మారెడ్డిపాలెంలో 2 పిచ్చికుక్కలు సుమారు పదిమందిని కరిచి ఐదు గేదెలను గాయపరిచిన ఘటనతో గ్రామస్థలు భయపడుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.