సత్యసాయి: మడకశిర మండలం నీలకంఠాపురంలో శ్రీరామనవమి బ్రహ్మరథోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్ రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో గోవిందాపురం, గంగలవాయి పాళ్యం పంచాయతీల గ్రామ పెద్దలతో కలిసి ఉత్సవాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. సామూహిక ఉచిత వివాహాలు, బ్రహ్మరథోత్సవం, పుట్ల పురుష నిర్వహించనున్నారు.