విశాఖ (Visakha) శివారు అప్పికొండ సముద్ర తీరంలోని రాళ్ల గుట్టలో పడి ఓ యువతి 12 గంటలు నరకం అనుభవించింది. నిన్న యువకుడితో కలిసి వెళ్లిన ఆమె ఫోటో (Photo) దిగుతూ రాళ్ల మధ్య పడిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లగా యువకుడు పారిపోయాడు. ఆమె యువకుడి (young man) తో కలిసి రాళ్ల గుట్టలపై ఫొటోలు తీసుకునేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆమె ఎత్తు ప్రదేశం నుంచి జారి పడింది. దీంతో, కంగారు పడిపోయిన యువకుడు ఆమెను అక్కడే వదిలేసి పారిపోయాడు. చుట్టూ చిమ్మచీకటి, జనసంచారం లేకపోవడంతో ఆమె రాత్రంతా నరకయాతన (Hellish) అనుభవిస్తూ మృత్యువుతో పోరాడింది.
బీచ్(Beach)కు వచ్చిన కొందరు ఆమెను గుర్తించి గజఈతగాళ్ల సాయంతో ఆసుపత్రికి తరలించారు. యువతికాళ్లకు తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. అయితే, తాను కాలుజారి పడిపోయానని, పరారీలో ఉన్న యువకుడిని ఏమీ అనొద్దని ఆమె చెప్పింది. మరోవైపు అంబులెన్స్ (Ambulance)సిబ్బంది యువతి తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె విశాఖకు బయలుదేరారు. కుమార్తె కనబడకపోవడంతో అంతకుముందే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తల్లిదండ్రులు తెలిపారు. కాగా, పరారీలో ఉన్న యువకుడికి కూడా ప్రమాదం జరిగిందని, అతను కూడా ఆసుపత్రి (Hospital) లో ఉన్నట్టు సమాచారం.