E.G: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తరుఫున ఏపీ జేఏసీ జాయింట్ సెక్రటరీగా రాజమండ్రికి చెందిన దడాల జగ్గారావు నియమితులయ్యారు. స్థానిక ఎన్జీవో హోమ్లో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో సంఘ అధ్యక్షుడు మీసాల మాధవరావు ఈ నియామకాన్ని ప్రకటించారు. జగ్గారావు మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.