నంద్యాల: సంపూర్ణ అక్షరాస్యత అందరి బాధ్యత అని, చదువుకున్న వారు చదువురాని వారికి చదువు నేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పైడేల జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం నంద్యాల మండలం కానాల, చాపిరేవుల గ్రామాల్లో అక్షరాంధ్ర ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పరీక్షల కేంద్రాలను డీఈవో జనార్ధన్ రెడ్డి తనిఖీ చేశారు.