విశాఖ: నగరంలో డ్రగ్స్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, గోవా నుంచి డ్రగ్స్, ఎండీఎంఏ, హ్యాష్ ఆయిల్ తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల పెందుర్తి, ఎంవీపీ ప్రాంతాల్లో ఎండీఎంఏ స్వాధీనం చేసుకుని యువకులను అరెస్ట్ చేశారు.