WG: మార్చి 14న తణుకులో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని తణుకు నాలుగో అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి కోరారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహనాల ప్రమాదాలు కేసులు, కుటుంబ తగాదాల కేసులు రాజీ చేసుకోవచ్చని చెప్పారు. లోక్ అదాలతో ద్వారా విలువైన సమయం, డబ్బులు ఆదా చేసుకోవచ్చని ఆమె వివరించారు.