విశాఖ: మాతృభాష రక్షణకు ‘తెలుగుదండు’ సమరభేరి మోగించింది. తెలుగు భాషా సంరక్షణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ, ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు సంస్థ అధ్యక్షుడు పరవాస్తు సూరి తెలిపారు. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు విశాఖ పౌరగ్రంథాలయంలో “మాతృభాషాభివృద్ధికి మార్గమేమి?” అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.