W.G: ఆచంట మండలం కోడేరు ఉత్తర పాలెంలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 42 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 10 కార్లు, 7 మోటార్ సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.