NLR: రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లును ఆమోదించినందుకు మంత్రి నారా లోకేశ్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర ఎంపీలు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటాన్ని, వారి త్యాగాలను గుర్తు చేసుకున్న నేతలు, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు.