PPM: పట్టణంలో మార్చి 1న జరగబోయే కౌలు రైతుల మహా సభలు విజయవంతం చెయ్యాలని రైతు సంఘం జిల్లా నాయకుడు రెడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం మక్కువ మండలం తురుమామిడి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కౌలు రైతులు కౌలు కార్డులు మంజూరు చెయ్యాలని, అన్నదాత సుఖీభవ పథకం వర్తింపు, బ్యాంకు రుణాలు, తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు.