VZM: చీపురుపల్లి మండలంలో చేపట్టే జనాభా లెక్కల నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని డీడీవో కే.హేమ సుందర్ రావు అధికారులకు సూచించారు. ఈమేరకు మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందికి ఒకరోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. గ్రామాల వారీగా చేపట్టనున్న జనాభా లెక్కల కార్యక్రమంపై ఆయన పలు సూచనలు చేశారు.