కృష్ణా: టీడీపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులైన మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ను నిన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, సుదీర్ఘ నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ దృక్పథాన్ని గుర్తించి అధిష్టానం ఈ బాధ్యత అప్పగించిందని అన్నారు.