కాకినాడ నడిబొడ్డున పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనందభారతి మైదానం వంటి బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోయి, వాకింగ్ ట్రాక్స్, వ్యాయామ పరికరాలు నిరుపయోగంగా మారాయి. మైదానాలను కేవలం ప్రదర్శనలు, సమావేశాల అద్దెకు మాత్రమే పరిమితం చేస్తున్నారని, కనీస నిర్వహణను విస్మరిస్తున్నారని నగరవాసులు వాపోతున్నారు.