అన్నమయ్య: చిన్నమండెం మండలంలో ఇవాళ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. పడమటికోన, బోరెడ్డిగారిపల్లి గ్రామాలలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా విని, తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమం, అభివృద్ధి అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.