అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. స్థానిక ఎన్టీఆర్ మైదానంలో నిన్న రాత్రి 7 గంటల నుంచి పది గంటల వరకు నిర్వహించిన అనకాపల్లి అన్నమాచార్య వాగ్గేయ వరదాయిని వారిచే ‘ఏడుకొండల వెంకటేశుడు’ సంగీత ప్రదర్శన, విశాఖకు చెందిన సాయినాట్య భారతి అకాడమీ వారు ప్రదర్శన ఆకట్టుకుంది.