TPT: తిరుపతిలో రేపు మంత్రి నారా లోకేష్ పలు క్రీడా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ. 10.20 కోట్లతో నిర్మించిన NTR క్రీడా ప్రాంగణం ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, ఇతర క్రీడా సదుపాయాల పనులు కూడా చివరి స్థాయికి చేరుకున్నాయి. మొత్తం 28.30 ఎకరాల్లో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నారు.