TPT: పేద పిల్లలు ఉన్నత స్థాయికి చేరాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. తిరుపతి అంబేడ్కర్ స్టడీ సర్కిల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, అభ్యర్థులతో ముచ్చటించారు. మొత్తం 340 మందికి సివిల్స్ ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్, 100 మందికి ట్యాబ్ల ద్వారా ఆన్లైన్ శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.