ATP: జిల్లాలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. వారం రోజులుగా ఎండ తీవ్రత అధికమవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి వేడి గాలులు మొదలై, రాత్రి వరకు ఉక్కపోత కొనసాగుతోంది. ఎండల ధాటికి జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.