E.G: విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని గౌతమీ జీవకారుణ్య సంఘం పాలక మండలి సభ్యులకు రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. మంగళవారం రాజమండ్రిలో గౌతమీ జీవకారుణ్య సంఘం వద్ద వసతి గదిని MLA ప్రారంభించారు. నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం పుష్కర నిధుల నుంచి రూ.2.80 కోట్లు మంజూరు చేసిందన్నారు.