CTR: ఎస్పీ శ్రీ తుషార్ దూడి ఆదేశాల మేరకు పూతలపట్టు మండలం అమ్మపల్లి గ్రామంలో ఎస్సై శ్రీ డి.గోపి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధైర్య స్పర్శ, సైబర్ నేరాల పై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నివారణ, రోడ్డు భద్రతా చర్యలు మరియు CCTV ఏర్పాటు యొక్క ప్రాముఖ్యతపై దృష్టి సారించారు. గ్రామస్తులు చురుకుగా పాల్గొన్నారు.