BPT: పిట్టలవానిపాలెం మండలంలోని చిందులు గ్రామంలో బుధవారం ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ తదితరాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తూ, ఉల్లంఘనలకు పాల్పడిన వారికి హెచ్చరికలు జారీ చేశారు.