గుంటూరు: ప్రజలు జనాభా లెక్కల స్వీయ గణనలో చురుగ్గా పాల్గొనాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ https://se.census.gov.in ద్వారా వాస్తవ సమాచారం అందించి దేశాభివృద్ధికి తోడ్పడాలన్నారు. ప్రజలు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను అధికారులు మళ్లీ ధ్రువీకరిస్తారని చెప్పుకొచ్చారు.