నెల్లూరు జిల్లా టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వెంకటాచలం పంచాయతీ వడ్డె పాలెం వైసీపీ నేత ఉప్పు రాఘవేంద్రను నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాఘవేంద్రపై దాడి హేయమన్నారు. వెంకటాచలం పంచాయతీలో దాడులు, దౌర్జన్యాలు ఎక్కువైపోయాయన్నారు.