నంద్యాల: బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో శుక్రవారం ఎంపీడీవో గాయత్రి శుక్రవారం పర్యటించారు. ఇంటి పన్ను, కులాయి పన్నులు సక్రమంగా చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు సూచించారు. పారిశుద్ధ్య పనులు సరిగా లేవని, దోమల బెడద పెరిగిందని గ్రామస్తులు చెప్పగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.