BPT: కర్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, 108 వాహనాన్ని ఎంపీడీవో శ్రీనివాసరావు పరిశీలించారు. అత్యవసర సమయాల్లో ప్రజలు 108 సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యాజలి, పేరలి, చింతాయపాలెం, గణపవరం గ్రామాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.