SKLM: కోటబొమ్మాళి మండలానికి డిగ్రీ కళాశాల మంజూరైన నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం కోటబొమ్మాళిలోని అధికారులతో సమావేశం నిర్వహించారు. కళాశాల స్థాపనకు సంబంధించిన ఏర్పాట్లు, భవన నిర్మాణం, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నియామకం వంటి అంశాలపై చర్చించారు. ఇందులో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, RDO పాల్గొన్నారు.