KDP: VN పల్లెలో ఏర్పాటు చేసిన బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కమలాపురం వ్యవసాయ శాఖ ఏడీఏ నరసింహారెడ్డి, ఏవో శ్యాంబాబుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా DCMS ఇన్ఛార్జ్ నాగిరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను పాటించి సొంత ఖర్చుతో విత్తన కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు.