E.G: చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం మూసివేశారు. ఉదయం 9:30 గంటలకు ఆలయ ద్వారాలను మూసినట్లు సహాయ కమిషనర్ బి.హరి సూర్య ప్రకాశ్ తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రహణం కారణంగా ఇవాళ జరగాల్సిన అన్ని పూజా కార్యక్రమాలు రద్దు చేసినట్లు దేవులపల్లి రవిశంకర్ తెలిపారు.