కైకలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జితేంద్ర బాబు తెలిపారు. సుమారు 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, 775 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉందన్నారు. 10, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, బీటెక్ వంటి విద్యార్హతలు ఉండి 18-35 వయస్సున్నవారు అర్హులన్నారు.