VZM: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్ధనరెడ్డిని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో పలు రోడ్ల అభివృద్ధి, మరమ్మతులపై ఆయనతో చర్చించారు. అలాగే, రోడ్ల విస్తరణ పనులకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన వినతిపత్రంపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.