ELR: బుట్టాయిగూడెం మండలం నూతిరామన్నపాలెం గ్రామానికి చెందిన జరబాల సాయి రామ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.బాధిత కుటుంబ సభ్యులు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకువెళ్లారు. బాధితుడికి ఉత్తమ వైద్య సేవలు అందేలా రూ 8,65,000 LOC లెటర్ను అందజేశారు. బాధితుడు త్వరగా కోలుకోవాలని కోరారు.