బాపట్ల: సంతమాగులూరు మండలం కుందుర్రుకు చెందిన గుంజి నవీన్ (27) ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన కన్నవారి కష్టాలు తీర్చాలనుకున్నాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ‘సర్కారీ కొలువు’ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం విషం సేవించిన నవీన్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఇవాళ చనిపోయాడు. నూరేళ్ల జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించడం అందరినీ కలిచివేస్తోంది.