JN: దేవరుప్పుల మండలం పెద్ద తండా గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ గుగులోతు రాధా కోక్యా నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. తక్కువ ధరకు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని తెలిపారు.