MDK: మాసాయిపేట మండలం హకీంపేటకు చెందిన మల్లయ్య (65) తూప్రాన్ లో జరిగిన విందుకు హాజరయ్యాడు. విందు భోజనంలో మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడకుండా స్పృహ తప్పాడు. తూప్రాన్ ఆసుపత్రికి తరలించగా సూపరిండెంట్ అమర్ సింగ్ తీవ్రంగా శ్రమించి గొంతులోని మాంసం ముక్క తొలగించడంతో ప్రాణాప్రాయం తప్పింది.