AKP: గంధం అమావాస్య పండగ సందర్భంగా ఎస్ రాయవరంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను ఇవాళ సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావు ప్రారంభించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని సూచించారు. ఈ పోటీల్లో 30 టీమ్స్ పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 15వ తేదీ వరకు టోర్నమెంటు కొనసాగుతుందన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు.