TPT: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష నిర్వహించారు. కేసుల వేగవంత పరిష్కారానికి పెండింగ్ కేసులు, NBWలను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. కోర్టు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయపాలన పాటిస్తూ, పోలీసు-న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయం పెంచి న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.