E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం APCNF ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ కీర్తి చేకూరి హాజరై ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. రైతులు వరి పంటలపై మాత్రమే ఆధారపడకుండా పంటల వైవిధ్యాన్ని అవలంబించాలని సూచించారు.