ప్రకాశం: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు మండలం కరవది గ్రామంలోని వివేకానంద విద్యావిహార్లో శాస్త్ర ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ మోడల్ ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకుని అబ్బురపరిచాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి మాట్లాడుతూ.. శాస్త్ర విజ్ఞానం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని తెలిపారు.