TPT: గూడూరు మునిసిపాలిటీలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మొదలైంది. నెల్లటూరు సచివాలయ ఉద్యోగిని వాత్సల్య ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేశారు. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేశామని చెప్పారు. ఇవాళ పింఛన్ తీసుకోని వారికి సోమవారం ఇవ్వనున్నారు.