కోనసీమ: అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఉండ్రాజవరపు శ్రీను(43) విద్యుత్తు తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం వీధి దీపాలు వేసేందుకు కరెంటు స్తంభం ఎక్కి లైట్లు బిగిస్తుండగా 11 కేవీ వైర్లు తగిలి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు.