అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి వేకువజామునే అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.