ATP: రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో నియోజకవర్గ ఎలక్ట్రోల్ అధికారి రవి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 18 ఏళ్ల నిండిన యువతి యువకులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు.