CTR: మండల స్థాయిలో పరిష్కరించగలిగిన అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. వెదురుకుప్పం మండలంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆయన పాల్గొని 158 వినతులను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు అధికంగా అర్జీలు వస్తున్నాయని పేర్కొన్నారు.