ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయావరణలో శుక్రవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తామన్నారు.