PPM: ఇల్లు లేని నిరుపేద గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేశారు. ఈమేరకు గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్కీ గిరిజనులతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు.